KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సాంకేతికత సహాయంతో సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (ఈ-గవర్నెన్స్) నుండి మొబైల్ గవర్నెన్స్ (ఎం-గవర్నెన్స్) వరకు అన్ని రకాల సాంకేతికతను అందిపుచ్చుకొని పౌరులకు మరింత మెరుగైన సేవలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
మీ సేవ 2.0 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4,500 కేంద్రాలలో 90 ప్రభుత్వ శాఖలకు చెందిన 450 విభిన్న సేవలను అందిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ eTaal నివేదిక ప్రకారం సమర్థవంతంగా ఎలక్ట్రానిక్ పౌర సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో రెండవ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.
టీ వాలెట్ ఒక అద్భుతం అని కేటీఆర్ కొనియాడారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలో ఆవిష్కరించామన్నారు. గత ఆరు సంవత్సరాల్లో టీ వాలెట్ ద్వారా రికార్డు స్థాయిలో రూ. 20,300 కోట్ల విలువైన లావాదేవీలు జరిపామన్నారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందించడంలో తెలంగాణ వినియోగిస్తున్న సాంకేతికత అద్భుతం అని ప్రశంసలు, జాతీయ స్ధాయిలో పలు అవార్డులు అందుకున్నామని కేటీఆర్ తెలిపారు.
సాంకేతికత సహాయంతో సుపరిపాలన!
👨💻📲ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (ఈ-గవర్నెన్స్) నుండి మొబైల్ గవర్నెన్స్ (ఎం-గవర్నెన్స్) వరకు అన్ని రకాల సాంకేతికతను అందిపుచ్చుకొని పౌరులకు మరింత మెరుగైన సేవలు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం
👉 మీ సేవ 2.0 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4500 కేంద్రాలలో 90… pic.twitter.com/MFyDmcu7Cp
— KTR (@KTRBRS) June 10, 2023