హైదరాబాద్ : ఇక్రిశాట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. శాస్త్రీయ పురోగతులు, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్ కీలక పాత్ర పోషించింది అని కేటీఆర్ కొనియాడారు. గ్రామీణ ప్రజలు పోషకాహార లోపాన్ని అధిగమించడంలో, పర్యావరణ క్షీణతను నివారించడంలో ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. ఇక్రిశాట్ 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇనిస్టిట్యూట్తో అనుబంధం ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యక్తులందరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Marking the occasion of completing 50 glorious years of @ICRISAT, I would like to congratulate all the scientists, scholars and people associated with the institute#ICRISAT50
— KTR (@KTRTRS) February 5, 2022