హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి మంగళవారం జన్మదినం జరుపుకోనున్నారు. ఆయన ఆమెరికా పర్యటనకు వెళ్తున్నందున ముందస్తుగా దయాకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పట్నం నరేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. అర్చకోద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ ఆధ్వర్యంలో ప్రముఖ ఆలయాల వేదపండితులు పలువురు పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి శేష వస్త్రం, గజమాలతో మంత్రి దయాకర్రావును సతరించారు. ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకుర్తి క్షేత్ర అభివృద్ధికి మంత్రి ఎర్రబెల్లి ఎల్లవేళలా సహకరిస్తున్నారంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.