బీజేపీ అసమర్థ పాలనను ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు మంత్రి కేటీఆర్. బీజేపీకి తనదైన శైలిలో చురకలంటిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో జూలై 3,4వ తేదీల్లో బీజేపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, అందమైన హైదరాబాద్కు ఈ సమావేశాలకు విచ్చేస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ (బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ)కి స్వాగతం అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఝుమ్లా జీవులందరూ (అబద్దాల హమీకోరులు) మా దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ను ఆస్వాదించడం మర్చిపోవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణలోని యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఐటీ హబ్ను సందర్శించాలని కోరారు. మీ మీ రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు కనీసం ప్రయత్నించండి అంటూ వాటి ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Welcome the WhatsApp University for its executive council meeting to the beautiful city of Hyderabad
To all the Jhumla Jeevis;
Don’t forget to enjoy our Dum Biryani & Irani Chai ☕️ #TelanganaThePowerhouse 👇 please visit, take notes & try to implement in your states pic.twitter.com/Ub0JRXSIUA
— KTR (@KTRTRS) July 1, 2022