రంగారెడ్డి : పనిచేసే నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని.. ప్రజా సమస్యల కోసం పాటు పడుతున్న చేవెళ్ల బీర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య (MLA Kale Yadaiah)ను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్లో మంత్రి కేటీఆర్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీపై తీరుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గురించి మీకు బాగా తెలుసునని, రెండుసార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉందన్నారు.
రైతుబీమా పెట్టి ధీమాగా ఉండేలా కేసీఆర్ చేశారనన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నారన్నారు. సౌభాగ్యలక్ష్మిలో ప్రతి ఆడబిడ్డకు రూ.3 వేలు ఇస్తామని పేర్కొన్నారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111జీవోను ఎత్తేశామన్నారు. 111 జీవోలో న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్కు అత్యంత సన్నిత ఎమ్మెల్యేల్లో కాలె యాదయ్య ఒకరని చెప్పారు. యాదయ్యకు ఓటు వేసి చేవెళ్ల అభివృద్ధికి పాటుపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.