ములుగురూరల్, మార్చి 30 : హైదరాబాద్లో ఏప్రిల్లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎన్. శోభారాణి, వైస్ ప్రిన్సిపాల్ గుండు రవిప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పాఠశాలకు చెందిన రాజ్కుమార్, చరణ్తేజ, చరణ్, అబ్దుల్ సమద్, సాయిరాం, వేదాంత్కృష్ణ, సాయిశిరీశ్, ఓమంత్, అన్వేష్తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఉన్నారని తెలిపారు. గురువారం ములుగులో జరిగిన జిల్లా స్థాయి పోటీలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, తబస్సుమ్ ఫాతిమ, రుద్రమదేవి, కృష్ణ, రమేశ్, హనీఫ్, అనురాధ, అపర్ణ, మంజుల, శ్రీనివాసాచారి, రమేశ్, నాగరాజు పాల్గొన్నారు.