Minister KTR | హైదరాబాద్ : పార్లమెంటరీ ప్యానెల్( Parliamentary Panel ) నివేదికపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పందించారు. వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో దేశం విఫలమైందన్న ప్యానెల్ పేర్కొంది. చైనా( China ) నుంచి బయటకు వచ్చే వ్యాపారులను ఆకర్షించలేదని నివేదికలో పేర్కొనడం జరిగింది. బీజేపీ( BJP )కి ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. టెలిప్రాంప్టర్( teleprompter ) చూసి ప్రసంగించడం సులువే. పటిష్ట ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టం అని కేటీఆర్ పేర్కొన్నారు.
This is what happens when NPA Government prioritises Politics over Economics 👇
Easy to deliver teleprompter speeches but difficult to deliver results unless transformative efforts are made
Huge letdown for Indian Youth pic.twitter.com/FEFhx79D4b
— KTR (@KTRBRS) March 25, 2023