హైదరాబాద్ : సోషల్ మీడియాలో చురుకుగా ఉంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. సందర్భాన్ని బట్టి కేంద్రంపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు కేటీఆర్ సంధిస్తుంటారు. అయితే ఈసారి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ఖేలో ఇండియా స్కీం అమలు కోసం కేంద్రం చేసిన కేటాయింపులపై మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల తీవ్ర అన్యాయం చూపిందన్నారు. తెలంగాణకు రూ. 24. 11, ఏపీకి రూ. 33.80 కోట్లు విడుదల చేయగా, గుజరాత్కు రూ. 608.37 కోట్లు, ఉత్తరప్రదేశ్కు రూ. 503.02 కోట్లు, కర్ణాటకకు రూ. 128.52 కోట్లు విడుదల చేసినట్లు నాగేశ్వర్ పేర్కొన్నారు.
The Union government’s budgetary allocation to states under the Khelo India scheme reveals a blatant bias against non-BJP states.Telangana got ₹24.11, AP got ₹33.80 crores only. While Gujarat got ₹608.37 crores, UP got ₹503.02 crores, and Karnataka got ₹128.52 crores.
— Prof. K.Nageshwar (@K_Nageshwar) August 9, 2022