హైదరాబాద్ : అంతర్జాతీయ పూల మార్కెట్ ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించారు. చాలా చిన్న దేశాలతో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్కు పూలను ఎగుమతి చేయడంలో భారత్ వెనుకబడి పోయిందని ట్విట్టర్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ప్రపంచ పూల మార్కెట్ విలువ 900 కోట్ల డాలర్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల 80 లక్షల డాలర్ల విలువైన గులాబీలను మాత్రమే భారత్ ఎగుమతి చేసింది. ఇథియోపియా 19.1 కోట్ల డాలర్లు, కెన్యా 59.6 కోట్ల డాలర్లు ఎగుమతి చేసింది. ఈ దేశాల మాదిరిగా ఇండియా ఎందుకు ఎగుమతులు చేయలేకపోతుందని నాగేశ్వర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ట్వీట్పై స్పందించిన కేటీఆర్.. ఇది సీరియస్గా ఆలోచించాల్సిన అంశమని, తగిన ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా సూచించారు.
This is something seriously worth thinking and planning Minister @SingireddyTRS Garu https://t.co/gNBZFCP7ES
— KTR (@KTRTRS) April 15, 2022