హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యువకుడు.. మేం మధ్య వయస్కులమంటూ మంత్రి కేటీఆర్ ఛలోక్తులు విసురుతూ శాసనమండలిలో నవ్వులు పూయించారు. మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కౌన్సిల్లో కేటీఆర్ మాట్లాడారు.
శాసనమండలిలో ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. విపక్ష సభ్యుల నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకుంటాం. మా సభ్యులకు కూడా సరిపడ సమయం ఇవ్వండి. మా జీవన్ రెడ్డి ఒక్కరే. ఆయనేమో యువకుడు, దూసుకుని పోతుంటారు. మేమంటే మధ్య వయస్కులం కానీ.. ఆయన ఇంకా యువకుడు. ఆయన ఒక్కరే ఉన్నప్పటికీ ఎక్కువ సమయం దొరుకుతుందన్నారు. మా వారు 35 మంది ఉన్నప్పటికీ తక్కువ సమయం దొరుకుతుందన్నారు. మాక్కూడా టైమ్ ఇవ్వండి.. మమ్మల్ని కూడా మాట్లాడనివ్వండి. సంయమనంతో మీరు ఇదే పద్ధతుల్లో ముందుకు వెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.