తెలంగాణ పునర్వైభవాన్ని చాటేలా ‘కాకతీయ ఉత్సవాలు’
సన్నాహక సమావేశంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సోమవారం ప్రగతిభవన్లో పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య పాత్రను మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, కోరుకంటి చందర్, పట్నం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వైభవాన్ని చాటేలా ‘కాకతీయ ఉత్సవాలు’
తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, పర్యాటక, సాంసృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ గర్వపడేలా ఉత్సవాలు ఉండాలని సూచించారు. అన్ని వర్గాల మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వరంగల్లో ఈ నెల 7 నుంచి ఏడురోజుల పాటు నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహంపై సోమవారం ప్రగతిభవన్లో మంత్రులు సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్ఠను పెంచేలా ఖర్చుకు వెనుకాడకుండా రాజకీయాలకతీతంగా, అందరూ పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు.
సాహితీ, సాంసృతిక, కళ ప్రదర్శనలను, మేధో చర్చలను నిర్వహించాలని తెలిపారు. వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్తు దీపాలతో అలంకరించాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంసృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.