హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో (Telangana bhavan) ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జయశంకర్ సార్ కలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నెరవేరుస్తున్నారని చెప్పారు. ఆయన తామందరికి ఆదర్శప్రాయుడని వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ సార్ పేరుపెట్టుకొని గౌరవించుకుంటున్నామని తెలిపారు.