హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడకు చేరుకుంటారు. ఆలయ చెరువు మైదానంలో జరుగనున్న వజ్రోత్సవ వేడుకలకు హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మంత్రి కేటీఆర్ రాకసందర్భంగా సిరిసిల్ల, వేములవాడలో భారీ ఏర్పాట్లు చేశారు.