హైదరాబాద్ : తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరులేదు. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజవర్గం కుల్కచర్ల(Kulkacharla)లో నిర్వహించిన రోడ్షో(Roadshow)కు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కకిరి సన్నబియ్యం అందజేస్తామన్నారు. రైతుల కోసం అనే పథకాలు ప్రవేశపెట్టాం. 75 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు రైతుబీమా అందిచామన్నారు.
రైతు చనిపోతే వారం రోజుల్లోనే రైతుబీమా రూ.5 లక్షలు వారం రోజుల్లోనే బాధిత కుటుంబానికి అందిస్తున్నామని స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఆడిబిడ్డకు మూడు వేలు ఇస్తామన్నారు. అలాగే దళితులు, గిరిజనులకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తం. తండాలను గ్రామ పంచాయతీలను చేశామని పేర్కొన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 12 శాతం రిజర్వేషన్లు పెంచామని, ప్రతి తండాలో సేవాల్ మహరాజ్ భవనాలు కట్టిస్తామని హామీనిచ్చారు.
కుల్కచర్లకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీనిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తామని చెబుతున్నారు. ధరణి తీసేస్తే రైతుల భూములు దళారుల చేతుల్లోకి పోతాయన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో కరెంట్ ఎలా ఉంది. ఇప్పుడు ఇలా ఉందో ఆలోచన చేయాలన్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు, లేవు కరెంట్ లేదు. ఆర్థిక క్రమశిక్షణతో అన్ని చక్కదిద్దుకున్నాం. డిసెంబర్ 3 తర్వాత కొత్త పథకం తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.