Minister KTR | ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు. ప్రముఖ గాయకుడు గద్దర్ ఆదివారం ఆరోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ అసెంబ్లీ ఆయనకు నివాళులర్పించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి తీసుకువచ్చిన ప్రజావాగ్గేయ కారుడు గద్దర్ ప్రసిద్ధి చెందిన గుమ్మడి విఠల్ అని కొనియాడారు. యావత్ తెలంగాణ ప్రజలకు దిగ్భ్రాంతి, దుఃఖాన్ని కలిగించిన వార్త అన్న అన్నారు. ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచి.. విప్లవ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి.. ఎన్నో సందర్భాల్లో ప్రజలను ఊర్రూతలూగించిన అద్భుతమైన గాయకుడు గద్దర్ అని ప్రశంసించారు.
ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దన మహాకళాకారుడని, ఆయన లేని లోటు తీర్చలేనిది. పూడ్చలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన వేదికను పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సందర్భాల్లో ఉత్సాహాన్ని నింపిన అద్భుతమైన కళాకారుడని, ఆయన లేకపోవడం బాధాకరమన్నారు. శాసనసభ, ప్రభుత్వం తరఫున సంతాపం ప్రకటించారు. ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం, జానపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామన్న కేటీఆర్.. కుటుంబంతో పాటు ఆయన మిత్రులకు మనోధైర్యాన్ని, ఆత్మస్థయిర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.