Puvvada Nageshwar Rao | హైదరాబాద్ : కిమ్స్ ఆస్పత్రి( KIMS Hospital )లో చికిత్స పొందుతున్న పువ్వాడ నాగేశ్వర్ రావును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్( Minister KTR ) మంగళవారం పరామర్శించారు. కేటీఆర్ వెంట నాగేశ్వర్ రావు కుమారుడు, మంత్రి పువ్వాడ అజయ్( Puvvada Ajay ) ఉన్నారు.
కేటీఆర్ను చూసిన వెంటనే నాగేశ్వర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పువ్వాడకు అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి కేటీఆర్కు వైద్యులు క్షుణ్ణంగా వివరించారు. నాగేశ్వర్ రావు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి తండ్రి, సీపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావు గారిని మంత్రి కేటిఅర్ పరామర్శించారు. @KTRBRS @puvvada_ajay pic.twitter.com/mbELlfaqGF
— Namasthe Telangana (@ntdailyonline) April 11, 2023