ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మంత్రి కేటీఆర్ దావోస్లో భేటీ అయ్యారు. నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకొన్నారు.
ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్ జగన్తో గొప్ప సమావేశం జరిగింది’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారన్న విషయం తెలియరాలేదు.