హైదరాబాద్: పట్టణ పేదల కోసం బడ్జెట్లో ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. కేంద్ర మంత్రికి తాజాగా మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ ఈసందర్భంగా లేఖలో స్పష్టం చేశారు.
దేశంలో పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. పట్టణీకరణ వలన పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉంది. పట్టణాల్లోని పేదల ఆదాయం పెంచాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలా పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం ప్రారంభించాలి. పట్టణ పేదల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలి. ఉపాధి హామీ ఉంటే పట్టణ పేదలూ కనీస అవసరాలు అందుకోగలరు. పార్లమెంటరీ స్థాయి సంఘం, సీఐఐ కూడా దీన్ని సిఫార్సు చేశాయి. అందుకే.. పట్టణ పేదల కోసం బడ్జెట్లో ప్రత్యేక ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలి.. అని మంత్రి కేటీఆర్ లేఖలో వెల్లడించారు.