హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ హెలీకాప్టర్లో వరంగల్ జిల్లాకు చేరుకుంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కిటెక్స్ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అనంతరం మామునూరు ఎయిర్పోర్టును సందర్శిస్తారు.
తర్వాత హనుమకొండలోని మంత్రి ఎర్రబెల్లి నివాసానికి చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. హనుమకొండ నయీంనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలలోని సాఫ్ట్ పాత్ సిస్టమ్ ఐటీ ఆఫీస్ను ప్రారంభించి, కంపెనీ మొదటి వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.