ఖమ్మం : ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. అష్టలక్ష్మి అమ్మవారిని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
ఖమ్మం నగరంలో మంత్రి @KTRTRS పర్యటిస్తున్నారు. నగరంలోని లకారం చెరువు పై ₹ 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ & మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడి లైటింగ్ ను మంత్రి @puvvada_ajay తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు pic.twitter.com/cDGLkefrnW
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 11, 2022