రాజన్న సిరిసిల్ల, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్సైట్ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు. తర్వాత అధికారులతో కలిసి భోజనం చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.
అంతకుముందు గంభీరావుపేట మండలం శ్రీగాధలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త రాజమల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సమీకృత కలెక్టరేట్లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు ఉన్నారు.