హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ కేక్ కట్ చేశారు. తెలంగాణ పాటలు, బాణాసంచా చప్పుళ్లతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారు.. pic.twitter.com/QDu1Hjyk5i
— Namasthe Telangana (@ntdailyonline) April 27, 2022