నల్లగొండ : మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గూండాలు చేసిన దాడిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పలివెలలో బీజేపీ గూండాలు దాడి చేశారు. 25 రోజులుగా మన ప్రచారం మనం చేసుకున్నాం. ఎవర్ని తన్నలేదు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్పై దాడి చేశారు.
పోలింగ్కు ఇంకా రెండు రోజులు ఉంది. ఓడిపోయేటోడు ఇలాంటి చిల్లర పనులు చేస్తడు. ఓడిపోయేటోడు గెలికి కయ్యం పెట్టుకుంటడు. టెంప్ట్ కావొద్దు. పోలీసు కేసు పెట్టినం. చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఎవరూ తొందరపడకండి. ఓడిపోయేటోడు ఆగమాగమై నిరాశ, నిస్పృహల్లో ఇలాంటి దాడులు, చిల్లర పనులు చేస్తరు. గ్రామాల్లో కావాలని కయ్యానికి దిగే ప్రయత్నం చేస్తరు. వాళ్లకు బుద్ది చెప్పాల్సిన మార్గం ఒక్కటే ఒక్కటి. మూడో తేదీన కారు గుర్తుకు ఓటేయండి. పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొనాలి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. మీ సమస్యల పరిష్కారం కోసం మంత్రి జగదీశ్ రెడ్డి, తాను కృషి చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.