హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పోరాటం చేశారని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతో మరో టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు అసెంబ్లీలో అడుగుపెడుతారని ఆశిస్తున్నా.. అని తన ట్వీట్లో పేర్కొన్నారు.