హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడె రాజీవ్ సాగర్ సోమవారం మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్ రాజీవ్ సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలన్నారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మంత్రి ఆకాక్షించారు. వారి వెంట పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఉన్నారు.