హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తనను షాక్కు గురి చేసిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేకపాటి ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.
సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడంతో.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.
Deeply saddened & shocked beyond belief to learn about the sudden demise of dear friend @MekapatiGoutham Garu
My heartfelt condolences to the family & friends in this hour of grief
Gone too soon brother. Pray that you rest in peace 🙏 pic.twitter.com/9V7IYk3o03
— KTR (@KTRTRS) February 21, 2022