హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఖండించారు. తెలంగాణలో (Telangana) ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. రౌడీ రాజకీయాన్ని సహించమని చెప్పారు. కాంగ్రెస్ గూండాల చేతిలో గాయపడి అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును (Guvvala Balaraju) మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి ఫ్రస్టేషన్తో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావొచ్చని చెప్పారు. బాలరాజుకు భద్రత పెంచాలని డిజీపీ అంజనీ కుమార్ను కోరుతున్నామన్నారు. మొన్న దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిచేశారని చెప్పారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ రాయితో దాడిచేశారు. శనివారం రాత్రి ప్రచారం ముగించుకొని గువ్వల బాలరాజు వెళ్తుండగా, వంశీకృష్ణ తన అనుచరులతో తారసపడ్డారు. రెండు వర్గాలు పరస్పరం దూషణకు దిగాయి. ఓ వైపు కార్యకర్తలు రెచ్చగొట్టి బీఆర్ఎస్పైకి ఉసిగొల్పిన వంశీకృష్ణ, స్వయంగా రాయి తీసి విసిరి కొట్టడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కిందపడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన దవాఖానకు తరలించారు.
తలకు బలంగా తాకటంతో గువ్వల అపస్మారక స్థితికి వెళ్లారు. నుదుటిపై తాకటంతో వాపు వచ్చిందని, పల్స్ పడిపోయాయని వైద్యులు చెప్పారు. ప్రాథ మిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మొన్నటికి మొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ర్యాలీపై కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలోని కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాలకుర్తి సభలో అడ్డొచ్చిన కార్యకర్తలను తన్ని గాయపరిచారు. దాడులను రేవంత్రెడ్డి ప్రోత్సహిస్తుండటంతో కార్యకర్తలు సైతం గూండాగిరి ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రె స్ దాడిని ఖండించారు.
కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే @GBalarajuTrs ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుసుకున్న కేటీఆర్
ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్ కి… pic.twitter.com/D5WbW7ZrLa
— BRS Party (@BRSparty) November 12, 2023