అంజయ్య యాదవ్ సౌమ్యుడు. ఆయనను గెలిపిస్తే సిద్దాపురం దగ్గర ఉన్న 334 ఎకరాల్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తాం. షాద్నగర్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు రావటంతో అసలైన హైదరాబాద్ ఈ ప్రాంతంలోనే కొలువు దీరనున్నది.
– మంత్రి కేటీఆర్
Minister KTR | రంగారెడ్డి/వికారాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)/షాబాద్: ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు గెలిచేది పదో, పన్నెండు మందో ఉంటారు. ఎన్నికలయ్యాక వారితో ఈ గాడ్సే (రేవంత్రెడ్డి) బీజేపీలోకి జంప్ అవటం ఖాయం’ అని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఆరెస్సెస్ మనిషి అని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్సింగ్ స్వయంగా సోనియాకు లేఖ రాశారని గుర్తుచేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో రూ.270 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం షాద్నగర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ప్రగతి నివేదన బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.173 కోట్లతో గిరిజన భవన్, స్కిల్ డెవలప్సెంటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పైలాన్ను మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎ మ్మెల్యేలు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, కాలె యాదయ్య, మహేశ్రెడ్డితో కలిసి ఆవిష్కరించా రు. ఈ రెండు సభల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ కనుగోలు, కొనుగోలును పెట్టుకొని డ్రామా లు ఆడుతున్నదని, ఓటుకు నోటు కేసులో దొరికిన థర్డ్ డిగ్రీ దొంగ రేవంత్ అని ఘాటు వ్యాఖ్యలు చేశా రు. రాజకీయ మరుగుజ్జులైన రేవంత్రెడ్డి, కిషన్రెడ్డితో సీఎం కేసీఆర్కు పోటీనా? అని ప్రశ్నించారు. 11 సా ర్లు గెలిపిస్తే ఏం చేయని కాంగ్రెస్.. ఇప్పుడు ఆరు గ్యా రెంటీలు అంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు ఆ పార్టీకి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారని వెల్లడించారు.
‘కాంగ్రెసోళ్లు వచ్చి మేం బీజేపీకి బీ టీం అంటరు. బీజేపోళ్లు వచ్చి మేం కాంగ్రెస్కు బీ టీం అంటరు. ప్ర జల దయ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మేం ఏ-టీంగా ఉంటాం తప్ప ఏ అడ్డమైనోనికో బీ టీంగా ఉండాల్సిన కర్మ పట్టలేదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్నదంతా రెండెకరాల రైతులేనని, వీళ్లకెందుకు 24 గంటల కరెంటు అని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ త్వరలోనే మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని, ప్రతిపక్షాల మ్యానిఫెస్టోకు తాతలాంటి మ్యానిఫెస్టో రాబోతున్నదని పేర్కొన్నారు. ఆశావర్కర్లు అంటే ప్రభుత్వానికి గౌరవం ఉన్నదని, కరోనాలో ప్రాణాలను అడ్డుపెట్టి సేవలు అందించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత గౌరవ వేతనం ఇస్తున్నామని, మళ్లీ సీఎం కేసీఆర్ను గెలిపిస్తే మరింత సేవ చేస్తామని తెలిపారు.
క్రిస్టియన్, మైనార్టీలను వ్యతిరేకించే వాళ్లకు నిండా విషమే ఉంటుంది. అందుకే కాంగ్రెస్ విషయంలో మైనార్టీలు జాగ్రత్తగా ఆలోచించాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇలా ఎవరనేది చూడకుండా సీఎం కేసీఆర్ అందరినీ కడుపున పెట్టుకుని చూసుకుంటున్నారు.
– మంత్రి కేటీఆర్
ప్రజలు కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ హామీలను నమ్మే పరిస్థితిలో లేరని గనులు, భూగర్భవనరులశాఖ మం త్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని, బీఆర్ఎస్కు మాత్రమే ఆ హక్కు ఉన్నదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించటం ఖాయమని తేల్చి చెప్పారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, మాజీ ఎమ్మెల్యే ఇంద్ర, బీఆర్ఎస్ నేతలు గౌండ్ల నాగేందర్గౌడ్, పట్లోళ్ల కార్తీక్రెడ్డి, కొప్పుల అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో గత వారం మంత్రి కేటీఆర్ పర్యటన రోజు సభకు వచ్చి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అంతారం గ్రామానికి చెందిన ఈగ సురేందర్రెడ్డి కుటుంబానికి షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అండగా నిలిచారు. గురువారం మంత్రులు కేటీఆర్, పట్నం మహేందర్రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునితామహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరుల చేతుల రూ.10 లక్షల చెక్కును సురేందర్రెడ్డి కుటుంబానికి అందజేశారు. బీఆర్ఎస్ తరఫున మరో రూ.2 లక్షలు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన జడ్పీటీసీని మంత్రి శభాష్ అవినాశ్ అని అభినందించారు.