హైదరాబాద్ : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంపై ఎన్నారైలతో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలందరినీ సమన్వయం చేసి, కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు మహేశ్ బిగాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. అలాగే తాను చదువుకున్న నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పాఠశాలకు తన తండ్రి బిగాల కృష్ణమూర్తి పేరుతో రూ.కోటి విరాళం ఇవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
సమన్వయం చేయడంతో పాటు ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలిచారని అభినందించారు. తాను ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం’ గురించి చెప్పగానే.. చాలా మంది దాతలు ముందుకు వచ్చారని మహేశ్ బిగాల తెలిపారు. చాలా తెలుగు సంఘాలు మద్దతును తెలిపాయని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.