జగిత్యాల : గతంలో తాగు, సాగు నీరు లేక ధర్మపురి నియోజకవర్గం(Dharmapuri constituency) అల్లాడింది. సీఎం కేసీఆర్ అధకారంలోకి వచ్చాక ధర్మపురి అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula )అన్నారు. గురువారం బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధర్మపురి లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ధర్మపురి మౌలిక వసతులతో పాటు సాగు,తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే మీ కష్ట, సుఖాల్లో పాలుపంచుకొని మీకు సేవ చేస్తానని మంత్రి పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.