జగిత్యాల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలోని బుగ్గారం మండలంలో గల పెద్దమ్మ చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో నీలి విప్లవం తీసుకొచ్చారన్నారు.
మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేశారు. నాడు చేపలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు ఎగుమతి చేసుకునే స్థాయికి వెళ్లామన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. నిరంతరం తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు మనమంతా అండగా నిలబడాలన్నారు.
కార్యక్రమంలో డీసీఎంస్ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ బాదినేని రాజమణి, జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, వైస్ ఎంపీపీ సుచిందర్, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.