జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలంలో గల దొంగ మల్లన్న స్వామిని ఆదివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తులా భారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.