పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన ఎస్.లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆర్థికంగా వెనుకబడిన లక్ష్మికి నిమ్స్ హస్పిటల్ లో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరు చేయించారు.
ఎల్వోసీకాపీని లక్ష్మి కుటుంబ సభ్యులకు మంత్రి సోమవారం హైదరాబాద్లో అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి మనో ధైర్యం చెప్పారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కోసం లక్ష రూపాయల ఎల్వోసీని అందజేసి మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎం కేసీఆర్ మేలు మర్చి పోలేమని, జీవితాంతంవారికి రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.