ధర్మారం, అక్టోబర్ 31: కాంగ్రెస్ హత్యారాజకీయాలు చేయడం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడి చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
స్వరాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణం నెలకొని ఉన్నదని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయాలే గానీ, దొడ్డిదారిని భయాబ్రాంతులకు గురిచేయడం తగదని మండిపడ్డారు.