పెద్దపల్లి : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్(KCR) అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ మంచి నీళ్ల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాటర్ ఫిల్టర్ బెడ్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి,నీటి సరఫరా జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు .
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని ప్రతి పల్లె తాగు నీటికి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మంచి నీటి బావులు, బోర్లు ఎండిపోయి దూరాన ఉన్న బావులు, చెరువులు, కుంటలకు వరుసలు కట్టి వంతుల వారీగా నీటిని తెచ్చుకున్నా సరిపోయేటివి కాదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) తెలంగాణలోని 12,729 గ్రామాలకు మిషన్ భగీరథ(Mission Baghiratha) పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళలు సంతోషంగా ఉండడానికి సీఎం కేసీఆర్ దార్శనికత కు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణ శ్రీ, జడ్పీటీసీలు పద్మజ సుధారాణి, సింగిల్ విండో చైర్మన్ బలరాంరెడ్డి, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.