తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం నాడు ఆయన దైవదర్శనం చేసుకున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్కు తిరుపతి దేవస్థానంలో వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామి వారిని వేడుకున్నారు.