శ్రీశైలం: శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా శ్రీశైలం చేరుకున్న మంత్రి కొప్పులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మల్లికార్జునుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు.