గొల్లపల్లి : నాగలితో దమ్ము చేస్తూ.. కూలీలతో కలిసి నాటేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందడి చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్లో గురువారం ‘వరినాట్ల సంబురాలు – మహిళా కూలీలతో మంత్రి’ అనే కొత్త కార్యక్రమానికి కొప్పుల శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా బొంకూర్లో వరినాట్లు వేస్తున్న పొలాన్ని సందర్శించి ఎడ్ల నాగలితో పొలం దమ్ము చేశారు. మహిళా కూలీలతో కలిసి వరినారు పంచుతూ నాట్లు వేశారు. కూలీలతో కలిసి భోజనం చేశారు. వారి బాగోగులు తెలుసుకొన్నారు.