జగిత్యాల : రాష్ట్రాన్ని యాబై ఏండ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ(Congress party) తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) ఆరోపించారు. మంగళవారం జగిత్యాలలో పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం , ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేపడుతున్న పథకాలు(Government Schems) దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
ఇటువంటి పథకాలను విమర్షిస్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. పోడు భూమలుకు పట్టాలు మాత్రమే కాదు రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా కూడా అందుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76 వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల సమీకృత కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ , జిల్లా కలెక్టర్ యస్మన్ భాష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.