గొల్లపల్లి, డిసెంబర్ 19 : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్కు చెందిన ఇద్దరు అనాథ చిన్నారులైన నాలుగేండ్ల అన న్య, రెండేండ్ల విశాల్ను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్కున చేర్చుకొన్నారు. వారి దీనస్థితిని చూసి చలించిపోయిన ఆయన అండగా నిలిచారు. చిన్నారుల తల్లి సుంకె లత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా.. మద్యానికి బానిసైన తండ్రి పిల్లల పోషణను పట్టించుకోకపోవడంతో ఆ చిన్నారులను వృద్ధురాలైన నానమ్మ పోచమల్లవ్వ చేరదీసింది. మంత్రి ఈశ్వర్ ఆదివారం చిల్వకోడూర్ పర్యటనలో భాగంగా వీరి పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారుల పోషణకు ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్టు నుంచి ప్రతి నెలా రూ.5 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.