హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): జిల్లాల వారీగా సదరం క్యాంపులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ కేటాయింపులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తున్నామని తెలిపారు. జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి డేకేర్ సెంటర్ల నిర్వహణపై దృష్టి సారించాలని చెప్పారు. అర్హులైన దివ్యాంగులకు వీల్చైర్లు, ల్యాప్టాప్లు అందజేయాలని, కొత్త మాడల్ వాహనాల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.