హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు విశేష సేవలందిస్తున్న సంస్థలను దత్తత తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని దివ్యా ంగుల సలహా మండలి చైర్మన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంపై అన్ని ప్ర భుత్వశాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించా రు. ప్రభుత్వ పథకాలు దివ్యాంగులకు అందేలా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి బేగంపేట టూరిజం ప్లా జాలో దివ్యాంగుల సలహా మండలి రాష్ట్రస్థాయి మొద టి సమావేశం గురువారం నిర్వహించారు. అన్ని ప్ర భుత్వశాఖల సెక్రటరీలు, సలహామండలి సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పలు అంశాలపై చర్చి ంచారు. 2016 దివ్యాంగుల చట్టం అమలు, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ తదితర అంశాలపై సలహాలు, సూచనలను కోరారు. అ నంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేనివిధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు అధిక మొత్తంలో పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఇటీవలే దివ్యాంగ విద్యార్థుల మెస్ చార్జీలు కూడా పెంచామని గుర్తు చేశారు. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించే గొప్ప మానవతామూర్తి సీఎం కేసీఆర్, దివ్యాంగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే కార్యక్రమాలను చేపట్టనున్నారని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై మరోసారి పూర్తిస్థాయిలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి సునీల్శర్మ, మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖల ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.