హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొ నియాడారు. గచ్చిబౌలిలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రాంగణం లో జనవరి 6న నిర్వహించే ఉర్దూ జాబ్ ఫెయిర్ కరపత్రాలను మంత్రి కొప్పుల శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలను కల్పించేందుకు తెలంగాణలో తొలిసారి ఉర్దూ జాబ్ ఫెయిర్ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ మేళాను మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, సెట్విన్, యూత్ అడ్వాన్స్మెంట్ కమిటీ, హైదరాబాద్ వీకర్స్ సెక్షన్ డెవలప్మెం ట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ మేళాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు టెక్నికల్, నాన్ టెక్నిక ల్ విభాగాల్లో నియమకాలను చేపడతాయని ఉర్దూ అ కాడమీ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్గౌస్ చెప్పారు. ప్రభుత్వ మదర్సాల్లో చదివిన యువతతోపాటు టెన్త్ నుంచి పీజీ, ఐటీఐ, డిప్లొమా కోర్సులు చదివినవారు ఈ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు jobmelaurdu manuusesetwin@ gmail.com చూడాలని సూచించారు. కార్యక్రమంలో మహ్మద్ యూసఫ్ఖాన్, డాక్టర్ సయ్యద్ అస్ఘర్ మహ్మద్, చంద్రమౌళి, సెరికల్చర్ మాజీ అధికారి డాక్టర్ ఖాద్రీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతి,సామరస్యాలను కాపాడేందుకు,ముస్లింల భద్రత సంక్షేమం,అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు,ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.జనవరి 6వ తేదీన గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసే “ఫస్ట్ ఉర్దూ జాబ్ ఫెయిర్ ఆఫ్ తెలంగాణ”బ్రోచర్ ను శనివారం మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉర్దూ భాషాభివృద్ధికి, వికాసానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.కెసిఆర్ ఉర్దూ భాషాభిమాని అని, తెలుగు, ఇంగ్లీషులతో సహ ఉర్దూలో కూడా అనర్గళంగా మాట్లాడుతారని వివరించారు.ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడాన్ని, మంత్రుల పేషీల్లో ఉర్దూ ఆఫీసర్లను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం,సెట్విన్, యూత్ అడ్వాన్స్ మెంట్ కమిటీ, హైదరాబాద్ వీకర్స్ సెక్షన్ డెవలప్ మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీల ఆధ్వర్యంలో జరిగే ఈ మొట్టమొదటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కొప్పుల ఈశ్వర్ యువతను కోరారు.ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ గౌస్ మాట్లాడుతూ,పెద్ద ఎత్తున జరిగే ఈ మేళాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని టెక్నికల్,నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు.పదవ తరగతి నుంచి పిజి,ఐటిఐ, డిప్లొమా, ప్రభుత్వ అనుమతి పొందిన మదర్సాలలో చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన యువత పాల్గొనవచ్చని తెలిపారు.మరిన్ని వివరాలకు jobmelaurdumanuusesetwin@gmail.com.సంప్రదించవలసిందిగా కోరారు.కార్యక్రమంలో మహ్మద్ యూసఫ్ ఖాన్ ( మౌలానా ఆజాద్ యూనివర్సిటీ), డాక్టర్ సయ్యద్ అస్గర్ మహ్మద్ ( అడ్వాన్స్ మెంట్ కమిటీ), చంద్రమౌళి (సెట్విన్ ),సెరికల్చర్ మాజీ అధికారి డాక్టర్ ఖాద్రీ, ప్రముఖ న్యాయవాది వలీ ఉర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.