హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కొండా సురేఖ మాట్లాడుతూ ‘మానవాళి మనుగడకు, భవిష్యత్ తరాల బాగు కోసం అడువులను సంరక్షించుకోవాలి. ఇది అందరి బాధ్యత.
ఈ బాధ్యతను గుర్తుచేయడానికి ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టులు, పట్టణాలు విస్తరించడం వల్ల అటవీ విస్తీరణం రోజురోజుకు తగ్గిపోతున్నది. అటవీ విస్తీరణం పెరుగుదలపై దృష్టిసారిస్తూ ఉన్న అడవులను రక్షించుకుందాం’ అని పిలుపునిచ్చారు.