హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy) అనారోగ్యంతో(Illness) దవాఖానలో చేరారు. ఆయన కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆ తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న ఢిల్లీ నుంచి తిరిగి రాగానే సోమాజిగూడలోని యశోద హాస్పటల్లో చేరారు. మంత్రికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. రెండు రోజులు దవాఖానలోనే ఉండాలని సూచించారు. దీంతో ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఆయన తాజాగా భువనగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.