హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి పలు అంశాలపై చర్చించారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్పురి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్గోయల్తో భేటీ అయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్లో ఉన్న రక్షణ శాఖ భూ ములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాజ్నాథ్సింగ్ను కోరా రు. హైదరాబాద్ మెట్రో రైలు రెం డో దశకు అనుమతి ఇవ్వాలని, ట్రా ఫిక్ రద్దీని తగ్గించేందుకు సైవేలు, ఫె్లై ఓవర్ల నిర్మాణానికి పూర్తిస్థాయి సహకారం అందించాలని హర్ద్దీప్సింగ్పురికి విజ్ఞప్తిచేశారు. దేశవ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు.
తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం (రా రైస్) సేకరించాలని పీ యూష్గోయల్కు విజ్ఞప్తిచేశారు. మొత్తంగా ఈ పర్యటనలో కొన్ని అంశాలపై సానుకూలత, మరికొన్నింటిపై ప్రతికూలత వచ్చింది. ప లు సమస్యలకు పరిష్కారాలు దొరికాయి. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, కేంద్ర హోం శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడం తదితర అంశాలపై చర్చించేందుకు హోంమంత్రి అమిత్షా తొలుత అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ, మణిపూర్ ఘటనలపై అఖిలపక్ష సమావేశం తదితర కారణాలతో అది రద్దయ్యింది. దీంతో మంత్రి కేటీఆర్ అమిత్షాను కలవలేకపోయారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఎంపీలు రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.