యాదాద్రి భువనగిరి : జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగారం అంజయ్య ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మంత్రి జగదీష్ రెడ్డిని కలసి అంబేద్కర్ భవన నిర్మాణ విషయాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణానికి గాను మంజూరు అయిన రెండు కోట్ల నిధుల నుంచి కోటి 40 లక్షలు వ్యయం చేసి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన రూ 40 లక్షల తో పాటు అవసరమైన నిధులు మంజూరు చేసి అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ ౩ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు.