సూర్యాపేట : ఓటేసిన ప్రతిసారి రెండు గంటలు కరెంటు కట్ చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదని, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )నియోజకవర్గంలో సభలు, సమావేశాలు రోడ్ షోలతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ముందంజలో ఉన్నారు. సోమవారం ఆత్మకూరు ఎస్, చివ్వెంల మండలాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరుసార్లకు పైగా ఓటు వేసిన గ్రామస్తులు ఎవరికి వేసిన ఓటుతో మంచి జరిగిందో ఆలోచించాలి అన్నారు. కాంగ్రెస్ కు వేసిన ఓటు రైతులను వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసింది అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పదవులే అజెండా అయితే.. ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ అజెండా అన్నారు.
2014లో బీఆర్ఎస్ కు వేసిన ఓటే ఇక్కడ భూములకు సస్యశ్యామలం చేసిందని పేర్కొన్నారు. గత రెండు మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఒకే ఒక్క నాయకుడు దేశంలో కేసీఆర్ మాత్రమే అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు రావాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.