రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఇఫ్తార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మాగాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని పేర్కొన్నారు. పలు పార్టీలు ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు రాజేసి పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం దుష్ట పరిపాలన సాగుతుందని దుయ్యబట్టారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టిస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.