Minister Jagadish Reddy | మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. అడుగడుగునా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనంలోనూ తనిఖీలు చేపట్టారు. గురువారం తంగేడుపల్లి గ్రామంలో నిర్వహించిన సోదాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహకరించారు.
మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేశారు. ఆ కాన్వాయ్లో ఏమీ లేదని నిర్ధారించారు. నియోజకవర్గ పరిధిలో తిరుగుతున్న వాహనాలను ఎక్కడికక్కడ అకస్మికంగా తనిఖీలు చేశారు. వచ్చి పోయే వాహనాలపై నిఘా తీవ్రతరం చేశారు.